30, ఏప్రిల్ 2011, శనివారం

మేఘసందేశం 38 వ శ్లోకం

పశ్చాదుచ్చైర్భుజతరువనం మండలేనాభిలీనః
సాంధ్యం తేజః ప్రతినవజపాపుష్పరక్తం దధానః,
నృత్యారంభే హర పశుపతేరార్ద్రనాగాజినేచ్ఛాం
శాంతోద్వేగస్తిమితనయనం దృష్టభక్తిర్భవాన్యా.


భావం:



సాయంకాలపూజ తర్వాత

శివుడు, నృత్యానికి పూనుకొన్నప్పుడు ( శివుని నృత్యాన్ని తాండవం అంటారు.)

ఎత్తిన ఆయన చేతులమీద,

క్రొత్తదాసానిపువ్వులా ఎఱ్ఱనైన సంధ్యాకాంతి గల నీవు, వ్రాలి

రక్తంచేత తడిసిన గజచర్మంమీద

ఆయనకు గల కోరికను పోగొట్టు.

అప్పుడు అమ్మవారి నయనాలు

భయంపోయి, స్తిమితపడతాయి.

( నీవల్ల ఆవిడకు గజచర్మభయం పోతుంది. కాన )

అప్పుడు నిన్ను వేడుకగా చూస్తారు.

ఇలా వారి అనుగ్రహానికి పాత్రుడవు కావచ్చు.



మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...