18, ఏప్రిల్ 2011, సోమవారం

మేఘసందేశం 24 , 25 , 26 శ్లోకాలు

పాండుచ్ఛా యోపవనవృతయః కేతకై స్సూచిభిన్నై
ర్నీ డారంభైర్గృహబలిభుజామాకులగ్రామచైత్యాః,
త్వయ్యాసన్నే పరిణతఫలశ్యామజంబూవనాంతాః
సంపత్స్యంతే కతిపయదినస్థాయిహంసా దశార్ణాః


భావం:


నీవు దశార్ణదేశాల్ని చేరేటప్పటికి,

అ దేశాల తోటలు,

పూచిన మొగలిపువ్వులకాంతులతో,

తెల్లగా ఉంటాయి.

గ్రామాల్లోని రచ్చచెట్లు,

కాకులు మొదలైన పక్షులు,

గూండ్లు కట్టుకోవడంవల్ల,

కదులుతూంటాయి.

నేరేడుచెట్లు, ఫలాలతో నీలంగా ఉంటాయి.

హంసలు, ఇక కొన్నిరోజులే అక్కడ ఉంటాయి.



తేషాం దిక్షు ప్రథితవిదిశాలక్షణాం రాజధానీం
గత్వా సద్యః ఫల మవికలం కాముకత్వస్య లబ్ధా,
తీరోపాంత స్తనితసుభగం పాస్యసి స్వాదు యత్త
త్సభౄభంగం ముఖమివ పయో వేత్రవత్యా శ్చలోర్మి.



భావం:



ఆ దశార్ణదేశాలకు రాజధానియైన, విదిశాపట్టణం

అన్ని దిక్కుల్లో ప్రసిద్ధిచెందినది.

అక్కడికి నీవు పోయినప్పుడు,

కాముకునికి కలుగు ఫలమంతా కలుగుతుంది.

ఏ విధంగా అంటే,

ఆ పట్టణ సమీపంలో, వేత్రవతి అనే నది ప్రవహిస్తోంది.

మధురమైన తరంగాలతో కదులుతూంటుంది.

దాని నీటిని,

బొమముడితో కూడుకొన్న ( ప్రియురాలి )

అధరంవలె తిన్నగా ఉఱుముతూ పానం చెయ్యి.

( అలా చేసినప్పుడే, కాముకఫలం కలుగుతుంది.)




నీచై రాఖ్యం గిరిమధివసే స్తత్ర విశ్రామహేతో
స్త్వత్సంపర్కాత్పులకితమివ ప్రౌఢపుష్పైః కదంబైః
యః పణ్యస్త్రీ రతిపరిమళో ద్గారిభిర్నాగరాణా
ముద్దామాని ప్రథయతి శిలావేశ్మభిర్యౌవనాని.



భావం:



ఆ విదిశాపట్టణ సమీపంలో,

" నీచైర్గిరి " అనే పేరు గల కొండ ఉంది.

ఆ కొండమీద,

చక్కగా వికసించిన పూలు గల కడిమిచెట్లున్నాయి.

ఆ చెట్లతో ఆ కొండ,

నీ సంపర్కంవల్ల గగుర్పాటు చెందినట్లుంటుంది.

ఆ కొండమీద కాసేపు విశ్రమించు.

పణ్యస్త్రీల రతిపరిమళాల్ని వెడలగ్రక్కుతున్న,

ఆ గిరి గుహలు,

విదిశాపురజనుల అధిక యౌవనాలను ప్రకటిస్తూంటాయి.



మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...