9, జూన్ 2011, గురువారం

మేఘసందేశం 57, 58 శ్లోకాలు

తత్ర వ్యక్తం దృషది చరణన్యాసమర్ధేందుమౌళేః

శశ్వ త్సిద్ధై రుపచితబలిం భక్తినమ్రః పరీయాః,

యస్మి౯ దృష్టే కరణవిగమాదూర్ధ్వ ముద్ధూతపాపాః

కల్పిష్యంతే స్థిరగణపదప్రాప్తయే శ్రద్దధానా:



భావం:


ఆ హిమవత్పర్వతమందు,

పూర్వం, శివుడు, ఒక రాతిమీద తన పాదాన్ని ఉంచాడు.

(అప్పుడు పాదచిహ్నం ఏర్పడింది.)

ఆ పాద చిహ్నాన్ని, సిద్ధులు ఎన్నోసార్లు పూజించారు.

అటువంటి శివపాదానికి నమ్రుడవై భక్తితో ప్రదక్షిణం చెయ్యి.

అలా చేసినవారి పాపాలు నశిస్తాయి.

అంత్యకాలంలో ప్రమథగణస్థానాన్ని పొందుతారు.

శ్రేయస్సు కలుగుతుంది. శివ సాలోక్యం సిద్ధిస్తుందని భావం.





శబ్దాయంతే మధురమనిలై: కీచకా: పూర్యమాణా:

సంసక్తాభి స్త్రిపురవిజయో గీయతే కిన్నరీభి:,

నిర్హ్రాదస్తే మురజ ఇవ చేత్కందరేషు ధ్వని: స్యాత్

సంగీతార్థో నను పశుపతే స్తత్ర భావీ సమగ్ర:.




భావం:



బొంగువెదుళ్లు, గాలిచే నింపబడి, మ్రోగుతున్నాయి.

( వెదుళ్లు మ్రోగాలంటే రంధ్రాలుండాలి కదా! ఉన్నాయి.

ఆ రంధ్రాలను ఎవరు చేశారు? తుమ్మెదలు చేశాయి.)

కిన్నరస్త్రీలు, గుంపులు గూడి,

శివుడు, త్రిపురాసురలను జయించిన కథను పాడుతున్నారు.

నీవు ఉరిమినచో, ఆ ధ్వని, కొండగుహలలో చేరి, వెలువడునప్పుడు,

మద్దెలమ్రోతలా ఉంటుంది.

అప్పుడు శివసంగీతం, సంపూర్ణం అవుతుంది.




మంగళం మహత్

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...