21, ఏప్రిల్ 2011, గురువారం

మేఘసందేశం 29 వ శ్లోకం

వీచిక్షోభస్తనితవిహగశ్రేణికాంచీగుణాయాః
సంసర్పంత్యాః స్ఖలితసుభగం దర్శితావర్తనాభేః,
నిర్వింధ్యాయాః పథి భవ రసాభ్యంతరః సన్నిపత్య
స్త్రీణామాద్యం ప్రణయవచనం విభ్రమో హి ప్రియేషు.




భావం:



నీవు ఉజ్జయినీ పట్టణానికి పోతున్నప్పుడు,

మార్గమధ్యంలో,

"నిర్వింధ్య " అనే నదిని కలుసుకోగలవు.

( ఈ నది, వింధ్య పర్వతానికి ఉత్తరంగా ప్రవహించే నది. )

ఆ నది అలల కదలికలకు,

( హంసాది ) పక్షులు, ధ్వనులు చేస్తూంటాయి.

ఆ పక్షుల పంక్తులు కనులకింపుగా ఉంటాయి.

ఆ నది తొట్రుపాటు పడుతూ,

సుందరంగా ప్రవహిస్తూ పోతూంటుంది.

సుడులు తిరుగుతూ ఉంటుంది.

ఆ నదిని కలిసి, ( ఆ నదీజలాలను తీసుకొని, )

రసాంతరంగుడివి కా. ( రసాంతరంగుడు = జలము లోపల కలవాడు. )





విశేషాలు:



పై భావం శ్లోకంలోని మూడు పాదాలకు.

దీనిలో ఒక అంతరార్థం ఉంది.

అది వివరించాక, నాలుగవ పాదభావం తెలుసుకొందాం.




నిర్వింధ్యను స్త్రీతో పోలిస్తే,

పైన పేర్కొన్న పక్షుల వరుసలు ఆమె మొలనూలు.

సుడి ఆమె నాభి.

తొట్రుపాటు ప్రవాహం , స్త్రీ సహజసుందరగమనం.

ఆమె నుండి మేఘుడు గ్రహించే రసం శృంగార రసం.

రసం అనే పదానికి ఉన్న అనేక అర్థాల్లో

జలం అనే అర్థాన్ని,

శృంగారరసార్థాన్ని,

కాళిదాసు ఇలా అందంగా ఉపయోగించుకొన్నాడు.



ఇక నాల్గవపాదానికి భావం:



స్త్రీలకు ప్రియులయందు, విలాసమే మొదటి ప్రణయవచనం అవుతోంది.

అంటే,

ఆడువారు, తమ విలాసాలచేతనే,

తమ మనోభిప్రాయాలను ప్రియులకు తెలుపుతారు.

గ్రహించినవాడు శ్రీనాథుడవుతాడు. - శృంగారి.

గ్రహించనివాడు వేమన అవుతాడు. - విరాగి.



మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...