19, ఏప్రిల్ 2011, మంగళవారం

మేఘసందేశం 27 వ శ్లోకం

విశ్రాంతః సన్వ్రజ వననదీతీరజాతాని సించ
న్నుద్యానానాం నవజలకణై ర్యూథికాజాలకాని,
గండస్వేదాపనయనరుజాక్లాంతకర్ణోత్పలానాం
ఛాయాదానాత్క్షణపరిచితః పుష్పలావీముఖానాం.



భావం:




నీవు,

ఆ నీచైర్గిరియందు శ్రమదీర్చుకొంటూ,

వననదీతీర ఉద్యానవనాల్లో,

( అక్కడి అడవులందలి నదుల ఒడ్డుల్లో ఉన్న తోటల్లో ),

పూచిన మొల్లమొగ్గలను,

క్రొత్త నీటిచుక్కలచేత తడుపు.

చెక్కిళ్ల మీద చెమటను,

పోగొట్టి, ఆ బాధతో వాడిన నల్లకలువలు చెవికొనల్లో గల,

పువ్వులు కోస్తున్న స్త్రీల ముఖాలకు,

ఛాయను ఇచ్చి,

కాసేపు పరిచయం గలవాడవై,

పొమ్ము.

అంటే,

అక్కడ పువ్వులు కోస్తున్న స్త్రీలు ఉంటారు.

వారికి ఎండచేత చెమట పట్టకుండా ఛాయను దానం చేయి.

ఇక్కడ ఛాయ అంటే "నీడ" అని "కాంతి" అని రెండు అర్థాలు చెప్పవచ్చు.

నీడను ఇస్తే సంతోషిస్తారు.

మరి కాంతి?

వారి ముఖాలు సహజకాంతివంతాలు.

సూర్యకాంతివల్ల వారి ముఖాల్లోని కాంతి అదృశ్యమైంది.

ఇపుడు మేఘుని నీడ వల్ల సూర్యకాంతి పడకపోవడంతో,

వారి ముఖకాంతి మరల వారి ముఖాలను చేరుతుంది.

అది వారికీ నీకూ సంతోషం కలిగిస్తుంది.

ఆ ఉపకారంచేత వారికీ నీకూ పరిచయం కూడా కలుగుతుంది.

ఇది నీకు ఇంకా సంతోషం కలిగిస్తుంది.

నిజమే కదా!

మగవారికి స్త్రీల పరిచయాన్నిమించిన ఆనందం ఏముంది?

కాని, దురుద్దేశంతో చేసుకొనే పరిచయాలు

పాములై కాటేస్తాయి అంటాడీ రావెమెస్సారెల్.



మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...