15, ఏప్రిల్ 2011, శుక్రవారం

మేఘసందేశం 18 , 19 శ్లోకాలు

ఛన్నోపాంతః పరిణతఫలద్యోతిభిః కాననామ్రై
స్త్వయ్యారూఢే శిఖరమచలః స్నిగ్ధవేణీసవర్ణే
నూనం యాస్యత్యమరమిథునప్రేక్షణీయా మవస్థాం
మధ్యే శ్యామః స్తన ఇవ భువః శేషవిస్తారపాండుః


భావం:


అడవిమామిళ్లు పండి,

ఆ ఆమ్రకూటం చుట్టూ క్రమ్ముకొని,

తెల్లగా కనిపిస్తున్నాయి.

నున్ననైన జడతో సమానమైన వర్ణంగల నీవు,

దాని శిఖరంమీద వ్రాలినట్టైతే,

చుట్టూ తెల్లగ,

మధ్యలో నల్లగా, ఉన్నట్టి,

భూమియొక్క స్తనమో

అన్నట్లుండి,

దేవమిథునాలకు చూడ్డానికి వేడుక కలిగిస్తుంది.




స్థిత్వా తస్మి న్వనచరవధూభుక్తకుంజే ముహూర్తం
తోయోత్సర్గ ద్రుతతరగతి స్తత్పరం వర్త్మ తీర్ణః
రేవాం ద్రక్ష్యస్యుపలవిషమే వింధ్యపాదే విశీర్ణాం
భక్తిచ్ఛేదైరివ విరచితాం భూతిమంగే గజస్య.



భావం:



ఆ ఆమ్రకూటపర్వతమందు,

కిరాతస్త్రీలు, పొదరిండ్లలో విహరిస్తూంటారు.

( వారి విహారాలు చూడ్డం ఒక లాభం )

అక్కడ కొంచెంసేపు వర్షించు.

దాంతో తేలికపడి, శీఘ్రంగా పోవచ్చు.

అలా కొంతదూరం వెళ్ళిన తర్వాత,

రాళ్లతో ఎచ్చుతగ్గయిన,

వింధ్యపర్వతపాదమందు వ్యాపించి ఉన్న,

నర్మదానది,

ఏనుగు దేహమందు చేసిన సింగారంలా, కనిపిస్తుంది.

దాన్ని చూడవచ్చు.

(అది చూడ్డం మరొక లాభం.)



మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...