26, ఏప్రిల్ 2011, మంగళవారం

మేఘసందేశం 34 వ శ్లోకం

జాలోద్గీర్ణై రుపచితవపుః కేశసంస్కారధూపై
ర్బంధుప్రీత్యా భవనశిఖిభిర్దత్తనృత్యోపహారః
హర్మ్యేష్వస్యాః కుసుమసురభిష్వధ్వఖేదం నయేథాః
పశ్య౯ లక్ష్మీం లలితవనితాపాదరాగాంకితేషు.



భావం:



ఉజ్జయినీ స్త్రీలు,

తమ కేశాలు సువాసనలను వెదజల్లడానికై

చేసుకొన్న, వేసుకొన్న ధూపాలు,

గవాక్షాల (windows) నుండి వెలువడి,

నీలో కలుస్తాయి.

అపుడు నీ దేహానికి వృద్ధి, (పుష్టి) కలుగుతుంది.

( ధూమం మేఘమవుతుందని, ఇంతకుముందు చెప్పబడింది కదా! )

అది నీకొక ఆతిథ్యం.

ఇంకా,

(తమ) బంధువనే ప్రేమచేత,

అక్కడి పెంపుడునెమళ్లు,

నీ ఎదుట నాట్యం చేసి, నీకు ఆనందం కలిగిస్తాయి.

( చంద్రదర్శనంతోనే సముద్రుడుప్పొంగినట్లు,
సూర్యసమీక్షణంతోనే కమలాలు వికసించినట్లు,
మేఘసందర్శనంతోనే నెమళ్లు పురివిప్పుతాయి, ఆడతాయి.
కాన మేఘుడు బంధువు.)

పూలచేత పరిమళిస్తున్నవై,

అందమైన ఆడువారి పాదాల లత్తుక గుర్తులున్న మేడలపై కూర్చుని,

ఉజ్జయినీలక్ష్మిని ( సంపదను , సౌభాగ్యాన్ని )

చూస్తూ, మార్గాయాసాన్ని పోగొట్టుకో.



మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...