15, మే 2020, శుక్రవారం

Sundarakanda సుందరకాండ 1-2


రామసుందరం  1-2
తేన పాదపముక్తేన  పుష్పౌఘేణ సుగంధినా |
సర్వతస్సంవృతశ్శైలో బభౌ పుష్పమయో యథా || 13 ||
రాలిన, సుగంధభరితమైన ఆ పూలతో పర్వతమంతా నిండిపోయి, ఒక పూలకొండలా ప్రకాశించింది.
తేన చోత్తమవీర్యేణ పీడ్యమానస్స పర్వతః |
సలిలం సంప్రసుస్రావ మదం మత్త ఇవ ద్విపః || 14 ||
(మావటివానిచే) పీడింపబడిన ఏనుగు ఎక్కువ మదజలం* విడిచినట్లు, హనుమచే పీడింపబడిన ఆ పర్వతం తన సెలయేళ్ల వల్ల ఎక్కువ జలాన్ని విడిచింది.
పీడ్యమానస్తు బలినా మహేంద్ర స్తేన పర్వతః |
రీతీ ర్నిర్వర్తయామాస కాంచనాంజనరాజతీః || 15 ||
బంగారు ఱాళ్లు, నీలంపు ఱాళ్లు, వెండి ఱాళ్లు పగిలివాని రేఖలు కనిపించాయి. 
ముమోచ చ శిలాశ్శైలో  విశాలాస్సమనశ్శిలాః |
మధ్యమేనార్చిషా జుష్టో  ధూమరాజీరివానలః || 16 ||
 సప్తజ్వాల*ల్లో మధ్యదైన ధూమ్రవర్ణ అనే జ్వాలతో కూడిన నిప్పు*నుండి పొగలు వెలువడినట్లు ఆ పర్వతం నుండి పొగలాంటి (నల్లని) ఱాళ్లు బయటపడ్డాయి.
గిరిణాపీడ్యమానేన  పీడ్యమానానిసర్వతః |
గుహావిష్టాని భూతాని వినేదుర్వికృతైస్స్వరైః || 17 ||
గిరిగుహల్లో నివసిస్తున్న భూతాలు (ప్రాణులు) వికృతస్వరాలతో గగ్గోలు పెట్టాయి.
స మహాసత్వ్తసన్నాద శ్శైలపీడానిమిత్తజః |
పృథివీం పూరయామాస దిశశ్చోపవనాని చ || 18 ||
శైలపీడానిమిత్తాలైన ఆ ఆక్రందన ధ్వనులు భూమి అంతా నిండాయి. దిశ*లందూ, ఉపవనాలందూ వ్యాపించాయి.
శిరోభిః పృథుభిస్సర్పా వ్యక్తస్వస్తికలక్షణైః |
వమంతః పావకం ఘోరం దదంశు ర్దశనైశ్శిలాః || 19 ||
సర్పాలు* కలతపడి, (కోపంతో) విషాగ్నులను క్రక్కుతూ శిలలను కాటువేశాయి.
తా స్తదా సవిషైర్దష్టాః  కుపితైస్తైర్మహాశిలాః |
జజ్వలుః పావకోద్దీప్తా  బిభిదుశ్చ సహస్రథా || 20 ||
కాటుకులోనైన ఆ గండశిలలు విషాగ్నికీలలతో మండుతూ, వేయి తునకలుగా పగిలాయి.
యాని చౌషధజాలాని  తస్మిన్ జాతాని పర్వతే |
విషఘ్నాన్యపి నాగానాం  శేకు శ్శమితుం విషమ్ ||21||
(అన్నిరకాల) విషాలను హరించే ఔషధాలు ఆ పర్వతం మీద ఉన్నా, ఆ సర్పాల ఘోరవిషాన్ని మాత్రం హరింపలేకపోయాయి.   
భిద్యతే౭యం గిరిర్భూతై  రితి మత్వా తపస్వినః |
త్రస్తా విద్యాధరా స్తస్మా దుత్పేతుః స్త్రీగణైస్సహ || 22 ||
(పంచ) భూతాలచే ఈ కొండ పగులకొట్టబడుతోంది అని తలచి, తాపసులు కలతచెందారు. విద్యాధరులు* భయపడి, తమ స్త్రీలతో ఆకాశానికి ఎగిరిపోయారు.
పానభూమిగతం హిత్వా హైమమాసవభాజనం |
పాత్రాణి చ మహార్హాణి కరకాంశ్చ హిరణ్మయాన్ || 23 ||
ఆ విద్యాధరులు, బంగారంతో చేసిన పాన, భోజన పాత్రలను, కలశాలను
లేహ్యానుచ్చావచాన్భక్ష్యాన్ మాంసాని వివిధాని చ |
ఆర్షభాణి చ చర్మాణి ఖడ్గాంశ్చ కనకత్సరూన్ || 24 ||
లేహ్యా*లను, భక్ష్యా*లను, పలాలను, ఎద్దుచర్మపుడాళ్లను, బంగారు పిడులు గల ఖడ్గాలను అక్కడే విడిచిపెట్టి ఎగిరిపోయారు.
కృతకంఠగుణాః క్షీబా రక్తమాల్యానులేపనాః |
రక్తాక్షాః పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేదిరే || 25 ||
కంఠహారాలు, ఎఱ్ఱని పూలమాలలు, రక్తచందనాలు ధరించిన, ఎఱ్ఱనికండ్లుగల ఆ విద్యాధరులు ఆకాశానికి చేరారు. 
హారనూపుర కేయూర  పారిహార్యధరాః స్త్రియః |
విస్మితా స్సస్మితా స్తస్థు  రాకాశే రమణైస్సహ || 26 ||
హారాలు, అందెలు, కేయూరాలు, కంకణాలు ధరించిన విద్యాధర స్త్రీలు, విస్మితులై, సస్మితులై, భర్తలతో కూడి, ఆకాశాన నిలిచారు.
దర్శయంతో మహావిద్యాం  విద్యాధరమహర్షయః |
సహితా స్తస్థురాకాశే  వీక్షాంచక్రుశ్చ పర్వతమ్ || 27 ||
విద్యాధరమహర్షులు నిరాధారంగా ఆకాశంలో ఉండటం అనే మహావిద్యను ప్రదర్శిస్తూ, పర్వతాన్ని చూస్తూ,
శుశ్రువుశ్చ తదా శబ్ద  మృషీణాం భావితాత్మనాం |
చారణానాం చ సిద్ధానాం  స్థితానాం విమలే(అ)ంబరే || 28 ||
నిర్మలాకాశంలో భావితాత్ములైన ఋషుల*,చారణుల, సిద్ధుల* మాటలను విన్నారు.
ఏష పర్వతసంకాశో హనూమాన్ మారుతాత్మజః |
తితీర్షతి మహావేగః  సముద్రం మకరాలయమ్ || 29 ||
పర్వతాకారుడు, మహావేగం గలవాడు, వాయునందనుడైన హనుమంతుడు మకరాలయమైన (మొసళ్లకు నిలయమైన) సముద్రాన్నిదాట గోరుతున్నాడు.
రామార్థం వానరార్థం చ  చికీర్షన్ కర్మ దుష్కరం |
సముద్రస్య పరం పారం  దుష్ప్రాపం ప్రాప్తుమిచ్ఛతి || 30 ||
రామునికొఱకు, వానరుని (సుగ్రీవుని) ప్రయోజనంకొఱకు ఎవరికీ చేయ నలవిగాని పని చేయగోరి, దాట నలవిగాని సముద్రపు ఆవలిగట్టుకు చేర గోరుతున్నాడు.
ఇతి విద్యాధరాశ్శ్రుత్వా  వచస్తేషాం మహాత్మనాం |
తమప్రమేయం దదృశుః  పర్వతే వానరర్షభమ్ || 31 ||
ఆ మహాత్ముల మాటలను విని, విద్యాధరులు, అప్రమేయుడైన ఆ వానరోత్తముని చూశారు.  
దుధువే చ స రోమాణి చకంపే చాచలోపమ: |
ననాద సుమహానాదం సుమహానివ తోయద: || 32 ||
కొండంతటి హనుమంతుడు వెండ్రుకలను విదిల్చాడు. అటూ ఇటూ కదిలాడు. గొప్ప మేఘంలా మహానాదం చేశాడు.
ఆనుపూర్వ్యేణ వృత్తం చ లాంగూలం లోమభిశ్చితం |
ఉత్పతిష్యన్ విచిక్షేప పక్షిరాజ ఇవోరగమ్ ||33||
ఎగరడానికి సన్నద్ధుడై, ఆఁదోక*గా ఉండివెండ్రుకలతో నిండిన తన వాలాన్ని(తోకను) గరుత్మంతుడు వ్యాళాన్ని(పామును) విదలించినట్లు విదిలించాడు.
తస్య లాంగూల మావిద్ధ మాత్తవేగస్య పృష్ఠతః |
దదృశే గరుడేనేవ హ్రియమాణో మహోరగః || 34 ||
ఆ మహావేగవంతుని వెనుక వంకరగా వ్రేలాడే ఆ లాంగూలం(తోక) గరుత్మంతునిచే తీసుకొనిపోయే మహాసర్పంలా కనబడింది.
బాహూ సంస్తంభయామాస  మహాపరిఘసన్నిభౌ |
ససాద చ కపిః కట్యాం చరణౌ సంచుకోచ చ || 35 ||
గొప్ప పరిఘ*ల్లాంటి తన బాహువుల్ని స్తంభింపజేసి, ఊపిరిని ఊర్ధ్వముఖంగా బిగపట్టి, నడుమును సన్నగా చేసి, పాదాలను ముడుచుకొని,
సంహృత్య చ భుజౌ శ్రీమాన్ తథైవ చ శిరోధరాం |
తేజస్సత్త్వం తథా వీర్య మావివేశ స వీర్యవాన్ || 36 ||
భుజాలను, మెడను బిగపట్టి, తనకున్న తేజం, బలం, వీర్యం అంతటినీ పూని, (సకల శక్తుల్నీ కేంద్రీకరించి)
మార్గమాలోకయన్ దూరా దూర్ధ్వం ప్రణిహితేక్షణః |
రురోధ హృదయే ప్రాణా నాకాశ మవలోకయన్ || 37 ||
దూరంగా వెళ్లాల్సిన మార్గాన్ని చూస్తూ, ఊర్ధ్వంగా దృష్టిని ఉంచి, ఆకాశాన్ని చూస్తూ, హృదయాన ఉచ్ఛ్వాసనిశ్శ్వాసాలను బిగపట్టి,
పద్భ్యాం దృఢమవస్థానం కృత్వా స కపికుంజరః |
నికుంచ్య కర్ణౌ హనుమా నుత్పతిష్య న్మహాబలః || 38 ||
పాదాల్ని నేలపై దృఢంగా మోపి, చెవుల్ని రిక్కించి, పై కెగరడానికి సన్నద్ధుడై,
వానరా న్వానరశ్రేష్ఠ  ఇదం వచనమబ్రవీత్ |
యథా రాఘవనిర్ముక్తః శరః శ్వసనవిక్రమః || 39 ||
ఆ వానర శ్రేష్ఠుడు, వానరులతో, " రాముడు విడచిన బాణం వాయువేగంతో వెళ్లినట్లు, మిక్కిలి వేగంతో
గచ్ఛేత్ తద్వద్గమిష్యామి  లంకాం రావణపాలితాం |
నహి ద్రక్ష్యామి యది తాం  లంకాయాం జనకాత్మజామ్ || 40 ||
నేను, రావణపాలిత లంక*కు వెళ్తాను. అక్కడ జానకిని చూడనేని,
అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం |
యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యా మ్యకృతశ్రమ: || 41 ||
అదే వేగంతో స్వర్గానికి వెళ్తాను. అక్కడ కూడా సీతను చూడనిచో,
బద్ద్వా రాక్షసరాజాన మానయిష్యామి రావణం |
సర్వథా కృతకార్యో౭హ మేష్యామి సహ సీతయా || 42 ||
రావణుని బంధించి, తీసుకొని వస్తాను. ఏదేమైనా, ఏవిధంగానైనా కృతకృత్యుడనై, సీతతో సహా తిరిగి వస్తాను.
ఆనయిష్యామి వా లంకాం  సముత్పాట్య సరావణాం |
ఏవముక్త్వా తు హనుమాన్  వానరాన్ వానరోత్తమః || 43 ||
లేకపోతే, రావణునితో సహా లంకను పెల్లగించి, తీసుకొని వస్తాను" అని, పలికి,
ఉత్పపాతాథ వేగేన వేగవానవిచారయన్ |
సుపర్ణమివ చాత్మానం మే న స కపికుంజరః || 44 ||
ఎట్టి విచారం లేకుండా, వేగంగా ఆకాశానికి ఎగిరాడు. అపుడు ఆయన తనను సుపర్ణుని*లా భావించుకొన్నాడు.
సముత్పతతి తస్మిం స్తు  వేగాత్తే నగరోహిణః |
సంహృత్య విటపాన్ సర్వాన్ సముత్పేతుస్సమంతతః || 45 ||
ఆయన ఎగరగానే, ఆ వేగానికి పర్వతంపై గల వృక్షాలన్నీ తమ కొమ్మలతో సహా ఆకాశానికి ఎగిరాయి.
స మత్తకోయష్టిబకాన్ పాదపాన్ పుష్పశాలినః |
ఉద్వహన్నూరువేగేన  జగామ విమలే(అ)ంబరే || 46 ||
మదించిన కొక్కెరలు, పుష్పాలు కలిగిన ఆ వృక్షాల్ని తన తొడలవేగంతో వెంట తీసుకొనిపోతూ,              
నిర్మలాకాశంలో పురోగమించాడు.
ఊరువేగోద్ధతా వృక్షా  ముహూర్తం కపిమన్వయుః |
ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాః || 47 ||
సుదీర్ఘయాత్రకు బయలుదేరిన బంధువును వీడ్కొల్పటానికి మిగిలినవారు కొంతదూరం అనుసరించినట్లు, వృక్షాలన్నీ ముహూర్తకాలం ఆయనను వెంబడించాయి.
తమూరువేగోన్మథితా  స్సాలాశ్చాన్యే నగోత్తమాః |
అనుజగ్ముర్హనూమంతం సైన్యా ఇవ మహీపతిమ్ || 48 ||
ఆయన తొడల వేగపుధాటికి పెల్లగించబడిన సాలవృక్షాలు మొదలైన మహావృక్షాలు సైన్యాలు మహారాజునులా హనుమంతుని అనుసరించాయి.
సుపుష్పితాగ్రైర్బహుభిః  పాదపైరన్వితః కపిః |
హనుమాన్ పర్వతాకారో బభూవాద్భుతదర్శనః || 49 ||
బాగా పుష్పించిన బహు వృక్షాలనడుమ ఉండడంతో, పర్వతాకారుడైన ఆ హనుమంతుడు చూసేవారికి అద్భుతంగా కనబడ్డాడు.
సారవంతో౭థ యే వృక్షా  న్యమజ్జన్  లవణాంభసి |
భయాదివ మహేంద్రస్య పర్వతా వరుణాలయే || 50 ||
దేవేంద్రునికి భయపడి, పర్వతాలు, సముద్రంలో దాక్కొన్నట్లు*, (ముందుగా) బరువుగల చెట్లన్నీ సముద్రంలో పడి, మునిగిపోయాయి.
స నానాకుసుమైః కీర్ణః  కపిస్సాంకురకోరకైః |
శుశుభే మేఘసంకాశః  ఖద్యోతైరివ పర్వతః || 51 ||
అనేక రకాల కుసుమా*లతో, మొలకలతో, మొగ్గలతో కప్పబడిన హనుమంతుడు, (రాత్రులందు) మిణుగుఱుపురుగులతో కూడిన పర్వతంలా దీపించాడు.
విముక్తాస్తస్య వేగేన ముక్త్వా పుష్పాణి తే ద్రుమాః |
అవశీర్యంత సలిలే  నివృత్తాస్సుహృదో యథా || 52 ||
ఆయన నుండి విడివడి, ఆత్మీయులను కొంతదూరం* అనుసరించి, వెనుతిరిగిన మిత్రుల్లా, పూలను విడచిఆ చెట్లన్నీ నీటిలో పడ్డాయి.
-----------------------------------------------------------------------------------------------------
* ఆఁదోక - ఆవుతోక. మొదట లావుగా, వర్తులాకారంగా నుండి, క్రమక్రమంగా సన్నబడిన ఆకృతి.
* పరిఘ - ఇనుప గుదియ. నాలుగుమూరల నిడివి గల దండం.
* లంక - విశ్వకర్మ అనే దేవశిల్పి, మాల్యవదాదుల కోరిక మీద పసిడిభవనాలతో నిర్మించిన సుందరనగరం. పిదప కుబేరుని స్వాధీనమైంది. ఆ తరువాత రావణుడు దాన్ని ఆక్రమించుకొన్నాడు.
* సుపర్ణుడు - మంచిఱెక్కలు గలవాడు అని వ్యుత్పత్తి. గరుత్మంతుడు. వినత కశ్యపులకు జన్మించిన వాడు. పుట్టగానే ఆకాశాని కెగిరి, తిరిగి వచ్చినవాడు. మాతృభక్తి కలవాడు. అనూరుడు ఇతని సోదరుడు. ఇతనికి విష్ణువే స్వయంగా తనకు వాహనమయ్యేలా వరం ఇచ్చాడు.
* వివరణ - పర్వతాలు ప్రజాపతి సంతానం. వాటికి మొదట ఱెక్కలు ఉండేవి. అవి తమ ఇచ్ఛవచ్చినచోటుకు ఎగిరిపోయి, వ్రాలుతూండటంతో ప్రజలకు, భూమికి బాధలు కలుగుతూండేవి. దాంతో ఇంద్రుడు వాటి ఱెక్కలు తెగగొట్టాడు. ఈ ఱెక్కలే మేఘాలయ్యాయి.
* కుసుమం - భ్రమరాలతో కూడిన పుష్పాన్ని కుసుమం అనాలి.
* బంధువులు ఇంటికి వచ్చి, తిరిగి పయనమైనప్పుడు వారిని నీటి సమీపం వఱకు దిగబెట్టాలి. అనగా చెఱువు వఱకు. తరువాత ఇక పోగూడదు. ఇంటికి వచ్చేయాలి.
---------------------------------------------------------------------------------------------------
ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం | జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితం || 2 ||

మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...