15, మే 2011, ఆదివారం

మేఘసందేశం 54 వ శ్లోకం

ఆసీనానాం సురభితశిలం నాభిగంధైర్మృగాణాం
తస్యాః ఏవ ప్రభవ మచలం ప్రాప్య గౌరం తుషారైః,
వక్ష్యస్యధ్వశ్రమవినయనే తస్య శృంగే నిషణ్ణః
శోభాం శుభ్రత్రినయనవృషోత్ఖాతపంకోపమేయాం.



భావం :



ఆ గంగానది హిమవంతం దగ్గరే ఉంటుంది.

ఆ హిమవత్పర్వత శిలలపై కస్తూరిమృగాలు కూర్చొంటాయి కాబట్టి

వాటి బొడ్డుల్లోని కస్తూరిగంధంతో ఆ అద్రి శిలలు పరిమళాలు క్రమ్ముతూంటాయి.

ఆ గంగానది పుట్టుకకే కారణమైన ఎక్కువ మంచుతో

ఆ గిరి, తెల్లగా కనబడుతూంటుంది.

అటువంటి పవిత్రమైన ఆ హిమవత్పర్వతశిఖరమందు కూర్చొంటే,

నీకు మార్గాయాసం తీరుతుంది.

తెల్లని ఆ కొండమీద కూర్చొన్న నల్లని నీవు,

శివుని వృషభం కుమ్మితే కొమ్మున అంటుకొన్న బురదమట్టిలా

బాగుంటావు.



మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...