4, మే 2011, బుధవారం

మేఘసందేశం 44 వ శ్లోకం

త్వ న్నిష్యందోచ్ఛ్వసిత వసుధా గంధసంపర్క రమ్యః
స్రోతోరంధ్రధ్వనితసుభగం దంతిభిః పీయమానః,
నీచై ర్వాస్య త్యుపజిగమిషో ర్దేవపూర్వం గిరిం తే
శీతో వాతః పరిణమయితా కాననోదుంబరాణాం.



భావం:



నీ వర్షంతో భూమి ఊరట

చెందుతుంది.

సువాసనలు వెదజల్లుతుంది.

గాలి ఆ పరిమళాన్ని ధరిస్తుంది.

ఏనుగులు ఆ సువాసనలను ఆఘ్రాణిస్తూంటాయి.

అప్పుడు వాని తొండాలనుండి

వినుటకు ఇంపైన ధ్వని వెలువడుతుంది.

అడవి మేడికాయలు పండి, ( అత్తిపండ్లు )

ఆ వాసనలు వస్తూంటాయి.

వీటన్నిటితో కూడిన చల్లని గాలి,

దేవగిరిని చేరబోతున్న నీకు అనుకూలంగా మెల్లగా వీయగలదు.


ఉన్నదున్నట్లుగా అంటే ఇలా చెప్పాలి.


నీ వర్షంచేత తడిసిన భూమి వెదజల్లిన సువాసనను ధరించినది,


ఏనుగులచేత ఆఘ్రాణింపబడి, ధ్వనులు చేయించేది,

మేడికాయలను పండించేది,

అయిన చల్లని గాలి,

దేవగిరిని చేరబోతున్న నీకు మెల్లగా వీయగలదు.


మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...