10, మే 2011, మంగళవారం

మేఘసందేశం 52 వ శ్లోకం

తస్మాద్గచ్ఛేరనుకనఖలం శైలరాజావతీర్ణాం
జహ్నోః కన్యాం సగరతనయస్వర్గసోపానపంక్తిం,
గౌరీవక్త్రభ్రుకుటిరచనాం యా విహస్యేవ ఫేనైః
శంభోః కేశగ్రహణమకరోదిందులగ్నోర్మిహస్తాః.



భావం:



ఆ కురుక్షేత్రంనుండి, బయలుదేరితే

కనఖలం అనే పర్వతం కనబడుతుంది.

హిమవంతంనుండి, దాని సమీపంలో గంగానది దిగింది.

తరువాత జహ్నుకన్య అయింది.

సగరచక్రవర్తిపుత్రులు స్వర్గానికి పోవడానికి మెట్లవరుసలా మారిన

పుణ్యరాశి అయిన అటువంటి గంగానదిని సేవించు.

శివుని శిరసున ఉన్న ఆ గంగ ( తన సవతి ) పార్వతిని పరిహాసం చేసినట్లుంటుంది.

హిమవంతంలో పుట్టి,

తనలో మునిగిన వారికి పుణ్యాన్ని ఇచ్చి,

సవతిని తలదన్ని, భర్త తలమీద ఉండే సౌభాగ్యాన్ని పొందిన

గంగను సేవిస్తే, నీకు మంచిది.


మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...