25, మార్చి 2011, శుక్రవారం

మేఘసందేశం



ఓం

కవికులగురువు కాళిదాసు రచించిన మేఘసందేశం ఖండకావ్యం 

శ్లోకాలు , భావాలు ,నాకు తోచిన విశేషాలు 
ఆసక్తి ఉన్న వారి కోసం 

సతతం.  

మేఘసందేశం

ఖండకావ్యాల్లోనే కాదు ప్రపంచ సాహిత్యంలోనే సర్వోత్కృష్ట రచన. ఉత్తరభారతంలో మేఘదూతమంటారు.

మానవహృదయాంతరసూక్ష్మభావవ్యక్తీకరణే కాక ప్రకృతిని, భౌగోళికమైన నదులు, పర్వతాలు, పట్టణాదులు, పల్లెలను కాళిదాసు చాల చక్కగా వర్ణించాడు. దీనిలో అంగిరసం (హృదయస్పర్శియైన) విప్రలంభ శృంగారం.

 

యక్షుడొకడు అలకాధిపతి కుబేరుని కోపానికి గురై ఒక సంవత్సరం భార్యావియోగంతో

రామగిరి (నాగపూర్ కు 28 మైళ్ళ దూరంలో వున్న రామటేక్) ఆశ్రమప్రాంతంలో కాలం గడుపుతుంటాడు. వర్షాకాలారంభంతో భార్యావియోగం సహింపరానిదై, విరహానలంలో కాలిపోతూ అలకానగరంలో ఉండే తన భార్య దగ్గరికి దూతగా వెళ్ళమని ఆకాశంలోని మేఘాన్ని ప్రార్థించి, ఆవిడకు సందేశాన్ని పంపటమే ఇందులోని ఇతివృత్తం.

 

అయితే సందేశం మొత్తం దాదాపు 20 శ్లోకాల్లోనే ఉంది. మిగతా కావ్యమంతా అలకానగర మార్గం, అలకానగరం, యక్షుని గృహం, విరహంతో ఉన్న యక్షిణి వర్ణనలు కన్పిస్తాయి. ఈ మార్గవర్ణనను కాళిదాసు ఆమ్రకూటంతో మొదలుపెట్టి, వింధ్యాచలప్రత్యగ్రభాగంలో విస్తరించిన నర్మదానది, దశార్ణదేశరాజధాని వేత్రవతినదీతీరస్థ విదిశానగరం, తత్సమీప నీచగిరి, ఉజ్జయిని (ఉజ్జయినీ విశేషాలను 15 శ్లోకాల్లో వర్ణించాడు. ఇంత విస్తరంగా ఇక ఏ ప్రదేశాన్ని వర్ణించలేదు) గంభీరానది, దేవగిరి, చర్మణ్వతీనది, తత్ససమీప దశపురనగరం, బ్రహ్మావర్తదేశం, సరస్వతీనది, కురుక్షేత్రం, కనఖలనగరం, గంగానది, హిమాలయాలు, (హిమాలయాలకు, కైలాసపర్వతానికి 11 శ్లోకాలు)  ఆ తర్వాత హిమాలయాల్లో వున్న అలకానగరాలను వర్ణించాడు.

 

మేఘసందేశ కావ్య రచనా ప్రేరణ

 

ఈ కావ్యంలోని సహజచిత్రణతో కూడిన హృదయాభివ్యక్తి స్వానుభవంతోనే సాధ్యమని, కాబట్టి కాళిదాసు భార్యావియోగం అనుభవించి వ్రాశాడని విమర్శకులు తలచారు. కావచ్చు. కాని వేదకావ్యేతిహాసపురాణాదుల్లో సందేశ ఘట్టాలున్నాయి. భారతంలో నలదమయంతుల హంసదౌత్యం, రామాయణంలో హనుమంతుని దౌత్యం, ఋగ్వేదంలోని సరమదౌత్యఘట్టం ప్రసిద్ధమైనవి. అయితే హనుమత్పందేశఘట్టం కాళిదాసు మీద అధిక ప్రభావాన్ని చూపి ఉండవచ్చు. రామాయణంలో వర్షర్తు సందర్భంలో రాముడు సీతా వియోగ బాధను పొంది, హనుమంతుని దూతగా పంపాడు. ఈ సందేశఘట్టం వాల్మీకిని అభిమానించిన కాళిదాసును ఆకర్షించి ఉంటుంది. వాల్మీకిశ్లోకభావ ప్రభావం ఉత్తరమేఘంలో కన్సిస్తోందని వరదాచార్యులు గుర్తించాడు. అంతేగాక కాళిదాసుకు బద్ధవైరి అని ఐతిహ్యంగల ఘటఖర్పరుడు ఒకానొక స్త్రీ విరహబాధతో మేఘం ద్వారా భర్తకు సందేశాన్ని పంపినట్లుగా ఒక సందేశ కావ్యాన్ని వ్రాశాడు. కవితో గల స్పర్దతోనో లేక హనుమత్సందేశాదులను అనుసరిస్తూనో కాళిదాసు సుందరకావ్యాన్ని రచించాడు. ఏమైతేనే ఈ రచన తర్వాత పూర్వ సందేశకావ్యాలు సూర్యునిముందు దివిటీలైపోయాయి.

 

మేఘసందేశ శ్లోక సంఖ్య

పూర్ణ సరస్వతి 110 శ్లోకాలకు వ్యాఖ్యానం వ్రాయగా వల్లభదేవుడు 111 శ్లోకాలకు, భరతసేనుడు 114 శ్లోకాలకు, మల్లినాథుడు 121 శ్లోకాలకు వ్యాఖ్యానాలు వ్రాయడంవల్ల శ్లోకసంఖ్యను గూర్చి ఏకాభిప్రాయం లేదు.

 

మేఘ సందేశంలోని వృత్తం

మందాక్రాంతం. ఇది సార్థక నామధేయురాలు. గుర్వక్షరాలతో మందమందంగా నడిచే ఈ వృత్తం కరుణాదిరసాలకు సరిపోతుంది. పెద్ద వృత్తం కాబట్టి విషయబాహుళ్యంతో, వియోగదుఃఖాన్ని అనుభవిస్తున్న ప్రియుని మనఃస్థితి చిత్రణకు తగి ఉంటుంది. కాళిదాసు ప్రయోగించటం వల్ల వృత్తానికి అనంతరకాలంలో బాగా ప్రచారం వచ్చింది.

 

మేఘసందేశంలోని ప్రతి ఒక్క శ్లోకంలో వర్ణిత దృశ్యాన్ని, వస్తువును ఒక చిత్రపటంగా గీయవచ్చు. కళ్లకు కట్టేటట్టుగా దృశ్యాన్ని కాళిదాసు వర్ణించాడు. ఒక శ్లోకాన్ని చదివి దానిలోని వస్తువును పాఠకుడు మనఃపటలం మీద తనవిదీరా దర్శిస్తూ, రమిస్తూ, మఱొక శ్లోకపఠనానికి ముందుకు సాగుతాడు. రమించే సమయం ఆయా సహృదయుని బట్టి ఎంతైనా కావచ్చు. వర్ణచిత్రాల ప్రదర్శనశాలను దర్శించినట్లుగా అన్నమాట. ఇందులోని ప్రతి శ్లోకం అందమైందే. రమణీయభావసంపదతో, వర్ణనలసొంపుతో కూడినదే. పాఠకుని హృదయాన్ని రసప్లావితం చేసేదే.

 

మేఘసందేశ టీకలు అనువాదాలు

 మేఘసందేశానికి దాదాపు 40 టీకలున్నాయి. సుప్రసన్నమైన వైదర్భీరీతిలో వ్రాయబడిన ఇంత చిన్న కావ్యానికి ఇన్ని టీకలుండటమే దాని వ్యాప్తి, ప్రఖ్యాతులను  తెలియజేస్తోంది. మేఘసందేశం అనేక ఆధునిక భారతీయ భాషల్లోనే కాక ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచ్, చైనా, టిబిట్ భాషల్లోకి అనువదింపబడింది.

 

మేఘసందేశకావ్య ప్రభావం - సందేశ కావ్యాలు

కాళిదాసు మేఘసందేశాన్ని ఆదర్శంగా పెట్టుకొని వాయు, పారావత, చక్రవాక, కీరసందేశాల వంటివి చాల రచింపబడ్డాయి. ఇవన్నీ అలభ్యం. భామహుడు వీటిని తన కావ్యాలంకారంలో విమర్శించాడు. క్రీ.శ.11 తర్వాత దాదాపు 50 సందేశ కావ్యాలు వ్రాయబడ్డాయి అని తెలుస్తోంది. వీటి మీద మేఘసందేశ కావ్యవస్తువు, శైలి, భావాల ప్రభావం స్పష్టంగా ఉంది. కొందరు కవులు మేఘసందేశ శ్లోకాల చివరిపాదాన్ని తీసుకొని సమస్యాపూరణ పద్దతిలో మొదటి మూడు పాదాలను వ్రాసి సందేశకావ్యాలను వ్రాసారు. జైన, వైష్లవ కవులు మేఘసందేశం ఆదర్శంగా ఎన్నో సందేశకావ్యాలను వ్రాసారు.

 

మేఘసందేశాన్ని అనుకరించిన కావ్యాల పట్టిక

ధోయి కవి - పవన సందేశం (క్రీ.. 1170)

వేదాంతదేశికులు - హంస సందేశం (క్రీ..1268 - 1369)

అవధూతరామయోగి – సిద్ధసందేశం (క్రీ. 13)

మాధవకవీంద్ర - ఉద్ధవసందేశం (క్రీ. 13)

వినయప్రభు - చంద్రసందేశం (క్రీ. 13)

ఉద్దండుడు - కోకిల సందేశం (క్రీ.. 1400 ప్రాంతం)

వామన భట్ట బాణుడు - హంససందేశం (క్రీ.. 1420)

సుందరగని/ణి శీలసందేశం (క్రీ.. 1484)

రూపగోస్వామి - హంస సందేశం, ఉద్ధవ సందేశం (క్రీ.శ.1490-1563)

విష్ణుదాసు - మనోసందేశం (క్రీ.. 15)

రఘునాథదాసుడు - హంస సందేశం (క్రీ.. 16)

విష్ణుత్రాత - కోకసందేశం (క్రీ. 16)

పరమేశ్వర - చకోరసందేశం (క్రీ. 16)

రుద్ర న్యాయవాచస్పతి - పికసందేశం (క్రీ.. 17)

వాదిరాజు - పవనసందేశం (క్రీ.. 17)

శ్రీకృష్ణసార్వభౌముడు పాదాంకసందేశం (క్రీ.. 17)

సిద్దనాథుడు - పవనసందేశం (క్రీ.. 17)

కృష్ణనాథుడు - వాతసందేశం (క్రీ.. 17)

వాసుదేవుడు – భృంగసందేశం (క్రీ.. 17)

జంబుకవి చంద్రసందేశం (క్రీ.. 17)

బోలానాథుడు - పంథసందేశం (క్రీ.. 17)

రామదయాళ్ - అనిలసందేశం (క్రీ.. 17)

శతావధానకవి శ్రీకృష్ణదేవ - భృంగసందేశం (క్రీ.. 18)

లంబోదర వైద్యుడు - గోపీసందేశం (క్రీ.. 18)

త్రిలోచనుడు - తులసీసందేశం (క్రీ.. 18)

వైద్యనాథుడు - తులసీసందేశం (క్రీ.. 18)

హరిదాసు - కోకిలసందేశం (క్రీ.. 18)

త్రైలోక్యమోహనుడు - మేఘసందేశం (క్రీ.. 19)

రామశాస్త్రి - మేఘ ప్రతిసందేశం (క్రీ.. 19)

శిష్టు కృష్ణమూర్తి  -యక్షోల్లాసం (క్రీ.శ. 19)

నిత్యానందశాస్త్రి - హంససందేశం (ఆధునికుడు)

కాళీప్రసాదు - భక్తిసందేశం (కాలం తెలియదు)

రామారామకవి - మనోసందేశం (కాలం తెలియదు)

శ్రీశైల వేంకటాచార్యుడు - కోకిలసందేశం (కాలం తెలియదు)

విద్యావిధానకవీంద్రాచార్య సరస్వతి - హంస సందేశం

పూర్ణసరస్వతి - హంస సందేశం

ఇద్దరు అజ్ఞాతకవుల రెండు హంససందేశాలు

ఇంకా కాకసందేశం, పాదపసందేశం, బకసందేశం, మృగసందేశం మొదలైనవెన్నో సందేశకావ్యాలు ఆధునికకాలం వఱకు వ్రాయబడ్డవి ఉన్నాయి.




కశ్చి త్కాన్తావిరహగురుణా స్వాధికారాత్ప్రమత్తః
శాపే నాస్తంగమితమహిమా వర్షభోగ్యేణ్య భర్తుః
యక్ష శ్చక్రే జనకతనయాస్నానపుణ్యోదకేషు
స్నిగ్ధ చ్ఛాయాతరుషువసతిం రామగిర్యాశ్రమేషు  1



భావం :  ఒక యక్షుడు 




(తన ప్రభువైన) కుబేరుని ఆజ్ఞను



ఏమరుపాటుచేత చెల్లించలేదు.



 అందువల్ల కుబేరుడు కోపించి,



సంవత్సరకాలం కాంతను (భార్య) ఎడబాసి,


దూరంగా ఉండమని శపించాడు. 



ఆ శాపంచేత, అతడు,




సీతారాములు వసించిన, 



దట్టములైన నీడలనిచ్చే చెట్లున్న



రామగిరి (చిత్రకూట) ఆశ్రమాల్లో ఉండి,


శాపప్రభావంచేత తన దివ్యశక్తి పోయినవాడై,


ప్రియురాలినెడబాసిన దుఃఖంచేత సంవత్సరకాలవిరహాన్ని

ఎంతో గొప్పకాలంగా గడుపుతున్నాడు.








విశేషాలు : రామగిరి ఎక్కడ ఉందో తెలిస్తే, "రూట్" అవగాహన అవుతుంది.








స్వ అధికారంనుండి ప్రమత్తులు కాకూడదు ఎవరూ కూడా.








భార్యావిరహం భరించలేనంతటి (గొప్ప)ది.









కాళిదాసు ఇక్కడ "గురు" అనే పదం వాడాడు.గమనించండి.








శక్తిమంతుల శాపంవల్ల మహిమలు (గొప్పతనాలు) అంతరిస్తాయి.








చెడుపనికి ఫలితం సంవత్సరం లోపు.









చక్రే అంటే చేసెను. 











చక్ర పదం వాడడం వల్ల కుదురుగా ఉండలేకపోయాడు అని స్ఫురిస్తుంది.








దట్టములైన నీడనిచ్చే చెట్లు అనడంవల్ల ,









యక్షునికి (భార్య సమక్షం) అనే










వెలుగే లేకుండాపోయింది అని స్ఫురిస్తుంది. చమత్కారం.








రామగిరి అని ప్రయోగించి, రాముని, 


ఆయన విరహాన్ని కాళిదాసు జ్ఞప్తికి తెస్తున్నాడు.















మంగళం మహత్










ఇది మధ్యప్రదేశ్ లోని రామటేక్ అనబడే రామగిరి ఇది ఆంధ్రప్రదేశ్ - కరీంనగర్ లోని రామగిరి





































































































భావం : ఒక యక్షుడు (తన ప్రభువైన) కుబేరుని ఆజ్ఞను










ఏమరుపాటుచేత చెల్లించలేదు. అందువల్ల కుబేరుడు కోపించి,










సంవత్సరకాలం కాంతను (భార్య) ఎడబాసి,










దూరంగా ఉండమని శపించాడు. ఆ శాపంచేత, అతడు,










సీతారాములు వసించిన, దట్టములైన నీడలనిచ్చే చెట్లున్న










రామగిరి (చిత్రకూట) ఆశ్రమాల్లో ఉండి,










శాపప్రభావంచేత తన దివ్యశక్తి పోయినవాడై,










ప్రియురాలినెడబాసిన దుఃఖంచేత సంవత్సరకాలవిరహాన్ని










ఎంతో గొప్పకాలంగా గడుపుతున్నాడు.














విశేషాలు :






రామగిరి ఎక్కడ ఉందో తెలిస్తే, "రూట్" అవగాహన అవుతుంది.










స్వ అధికారంనుండి ప్రమత్తులు కాకూడదు ఎవరూ కూడా.










భార్యావిరహం భరించలేనంతటి (గొప్ప)ది.










కాళిదాసు ఇక్కడ "గురు" అనే పదం వాడాడు.గమనించండి.










శక్తిమంతుల శాపంవల్ల మహిమలు (గొప్పతనాలు) అంతరిస్తాయి.










చెడుపనికి ఫలితం సంవత్సరం లోపు.










"చక్రే" అంటే చేసెను. చక్ర పదం వాడడం వల్ల










కుదురుగా ఉండలేకపోయాడు అని స్ఫురిస్తుంది.










దట్టములైన నీడనిచ్చే చెట్లు అనడంవల్ల ,










యక్షునికి (భార్య సమక్షం) అనే










వెలుగే లేకుండాపోయింది అని స్ఫురిస్తుంది. చమత్కారం.










రామగిరి అని ప్రయోగించి, రాముని,










ఆయన విరహాన్ని కాళిదాసు జ్ఞప్తికి తెస్తున్నాడు.
































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...