26, మార్చి 2011, శనివారం

మేఘసందేశం ౩ వ శ్లోకం

తస్య స్థిత్వా కథమపి పురః కౌతుకాధానహేతో,
రంతర్బాష్ప శ్చిరమనుచరో రాజరాజస్య దధ్యౌ,
మేఘాలోకే భవతి సుఖినో2ప్యన్యథావృత్తి చేతః
కంఠాశ్లేషప్రణయిని జనే కిం పునర్దూరసంస్థే. 3

భావం : కుబేరుని అనుచరుడైన ఆ యక్షుడు,
కంటి లోపల ఇమిడి ఉన్న కన్నీళ్ళతో,
ప్రియురాలితో కూడి ఉండాలనే కోరికను కలిగించడానికి కారణమైన
ఆ మేఘం ఎదుట ఎట్టకేలకు నిలిచి,
చాలసేపు చింతించాడు.

(చింత = తలఁపు)
(ఎందుకంటే) మేఘదర్శనం, ప్రియురాలి సమక్షంలో ఉన్నవాని
మనసును కామోద్దీపం చేస్తుంది.
మరి కంఠాలింగనాన్ని కోరుతున్న
భార్య దూరంగా ఉంటే ఇంక ఏమి చెప్పవచ్చు?

విశేషాలు : ~ ఆ యక్షుడు, యక్షరాజైన కుబేరుని అనుచరుడు.
కుబేరుడు ఉత్తరదిక్పాలకుడు.
అతని అనుచరునికి మేఘం మీద అధికారం ఉంటుంది.
అనుచరుడని కాళిదాసు చెప్పడంలో ఉద్దేశం ఇదే.
అయినా ఆజ్ఞాపించక యాచిస్తాడు. (6వ శ్లోకంలో తెలుస్తుంది.)
ముందే ఈ విషయం తెలిస్తే చదువరులకు యక్షుని వినయం
అర్థం అవుతుందని నా ఉద్దేశం. కాబట్టి అతడు అవినయపూర్వకంగా
కాక "విధి"పూర్వకంగా తప్పుచేశాడని తెలుస్తుంది.

~ ధీరోదాత్తుడు కాబట్టి కన్నీళ్ళు పైకి రాలేదు.

~ మేఘాలు కమ్ముకొన్నాక ,
వాటిని చూసి,
వర్షభావనతో
ఆహార ప్రియులకు పకోడీలమీద ఎలా ఉద్దీపన కలుగుతుందో,
అలాగే కాముకులకు
(ఇక్కడ కామం అంటే ధర్మపత్నియందలి కామం మాత్రమే)
మేఘదర్శనం కోరికలను పుట్టిస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...