20, నవంబర్ 2011, ఆదివారం

మేఘసందేశం 59 వ శ్లోకం

ప్రాలేయాద్రే రుపతట మతిక్రమ్య తాంస్తా న్విశేషాన్

హంసద్వారం భృగుపతి యశోవర్త్మ యత్క్రౌంచ రంధ్రమ్,

తేనోదీచీం దిశ మనుసరే స్తిర్యగాయామశోభీ

శ్యామః పాదో బలినియమనాభ్యుద్యతస్యేవ విష్ణోః





భావం :


హిమవత్పర్వతతటాల్లో ( హిమపర్వత ప్రదేశాల్లో / మంచుకొండ చఱియల్లో )

ఆ యా విశేషాలను అతిక్రమించి, ( దాటిపోయి )

హంసలదారి మరియు పరశురాముని కీర్తిమార్గం అయిన క్రౌంచ పర్వతబిలంనుండి,

బలిని బంధించటానికి పూనుకొన్న విష్ణువు నల్లని పాదంలా

అడ్డంగానూ పొడవుగానూ ప్రకాశిస్తూ ఉత్తరదిశగా వెళ్లు.




వివరణ :

హిమాద్రి యందు చూడదగిన ఎన్నో వింతలున్నాయి.

అవన్నీ చూడాలంటే ఆలస్యమవుతుంది.

కాబట్టి నీ దారిన పో.

పోతూంటే క్రౌంచం అనే పేరుగల మహాపర్వతం అడ్డు వస్తుంది.

ఆ పర్వతానికి ఒక రంధ్రం ఉంది.

అది పూర్వం పరశురాముడు చేసినది.

పరశురాముడు కుమారస్వామితో కలసి,

శివునివద్ద అస్త్రవిద్య నేర్చుకొంటూ, స్కందునితో పోటీపడి,

వాడి బాణాలతో ఈ క్రౌంచపర్వతాన్ని భేదించి, ప్రసిద్ధికెక్కాడు.

అప్పటినుండి వర్షాకాలం రాగానే హంసలు,

ఈ రంధ్రంనుండి వెడలి, మానససరోవరానికి చేరతాయి.

నీవు ఈ దారిగుండా వెళ్లు.

అప్పుడు నీవు, బలిని అణచదలచి, ఎత్తిన విష్ణువు పాదంలా శోభిల్లుతూంటావు.





మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...