27, ఏప్రిల్ 2011, బుధవారం

మేఘసందేశం 35 వ శ్లోకం

భర్తుః కంఠచ్ఛవిరితి గణైః సాదరం వీక్ష్యమాణః
పుణ్యం యాయా స్త్రిభువనగురోర్ధామ చండీశ్వరస్య,
ధూతోద్యానం కువలయరజోగంధిభిర్గంధవత్యా
స్తోయ క్రీడానిరతయువతిస్నానతిక్తైర్మరుద్భిః.



భావం:



నీకు అలౌకికానందం, లౌకికానందం ఒకేసారి కలుగుతాయి.

( తమ ) స్వామి యొక్క

కంఠం కాంతి వంటి కాంతి గలవాడవనే కారణంచేత

( అనగా శివునికంఠంలా నల్లగా ఉంటావు కనుక )

ప్రమథగణాలు (నిన్ను) ఆదరణతో చూస్తారు.

వారి ఆదరణ పొందినవాడవై,

త్రిభువనగురుడు,

చండికాపతి అయిన శివునియొక్క

పవిత్రధామాన్ని పొందు.

ఈ క్షేత్రప్రవేశంతో అలౌకికానందం.

( ఉజ్జయిని మహాపుణ్యక్షేత్రం. ఈశ్వరుడు, మహాకాలుడనే పేరుతో
కొలువై ఉన్నాడక్కడ. ద్వాదశజ్యోతిర్లింగాలలో ఉజ్జయిని ఒకటి.)

( పుణ్యక్షేత్రమే కాదు భోగక్షేత్రం కూడా అంటున్నాడు. ఎలా అంటే )

అక్కడ గంధవతి అనే నది ఉంది.

దాని నిండా పరిమళాలు వెదజల్లే కలువపూలు ఉన్నాయి.

ఆ గంధవతీనది మీదినుంచి,

ఈ కలువపూల పరిమళాన్ని,

అందులో స్నానం చేసే యువతుల

స్నాన ( చందనం మొదలైన ) వస్తువుల పరిమళాన్ని మోసుకొని వస్తూ,

వీచే గాలులు, ఉద్యానవనాల్ని కదిలిస్తూంటాయి.

అలా ఉద్యానపుష్పపరిమళాలు కూడా

గంధవతీ నదీ వాయువులు మోసుకొచ్చే పరిమళాలతో కలుస్తాయి.

ఈ మూడువిధాలైన గంధాలతో చల్లగాలి మెల్లగా వీస్తూంటుంది.

కాబట్టి చాల సుఖం కలుగుతుంది.

ఇది లౌకికానందం.

ఈ రెండు రకాల ఆనందాలతో నీకు విశేషలాభం కలుగుతుంది.



మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...